బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం…

154
bjp
- Advertisement -

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు టీఆర్ఎస్ నేతలు. నిజామాబాద్ పట్ట‌ణంలోని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద, జ‌గిత్యాల జిల్లాలోని మెట్‌ప‌ల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అరవింద్ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు.

కవిత ఎదుగుదలను చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని టీఆర్ఎస్ నాయ‌కులు ధ్వ‌జ‌మెత్తారు. మహిళ అని చూడకుండా కించపరుస్తూ మాట్లాడిన అర్వింద్‌ మహిళా జాతిని అవమానించారని దుయ్యబట్టారు. ఎంపీ అరవింద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ప్రజల గుండెల్లో కవిత నిలిచారని, తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందాక నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో విస్త్రృతంగా పర్యటిస్తున్న కవితపై సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారానికి దిగుతుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

- Advertisement -