నివేదాతో నాగశౌర్య రొమాన్స్..

213
Nivetha okays Naga Shourya film
- Advertisement -

జెంటిల్మెన్, నిన్నుకోరి చిత్రాల్లో కథానాయికగా నటించి తన అందంతోనే కాక అభినయంతోనూ ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ బ్యూటీ నివేదా థామస్‌. తర్వాత ఎన్టీఆర్‌ జై లవకుశతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.

అయితే తర్వాత వచ్చిన జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో కొద్దికాలం విరామం తీసుకున్న ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీకి రంగం సిద్దం చేసింది.

యంగ్ హీరో నాగశౌర్య సరసన నివేదా థామస్ కథానాయికగా నటించనుంది. మన్యం ప్రొడక్షన్స్‌ తొలి ప్రయత్నంగా ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘మేం వయసుకు వచ్చాం, ఆలా ఎలా, సుప్రీమ్‌, పిల్ల జమిందార్‌, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ‘ఛలో’ చిత్రాలకు శ్రీరామ్‌ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. ప్రస్తుతం నాగశౌర్య నటించిన ఛలో విడుదలకు సిద్దంగా ఉంది.

- Advertisement -