నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు..

244
Niti Aayog CEO Amitabh Kant
- Advertisement -

నీతి ఆయోగ్ సీఈవో‌గా ఉన్న అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్‌ 30,2022 వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్‌ పదవీకాలాన్ని పొడిగిస్తు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్‌ సీఈవో పదవిని అమితాబ్‌ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్‌ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.

- Advertisement -