నితిన్ హీరోగా నటించిన లై సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కించారు కానీ ఈ సినిమా బాక్సాఫిసు వద్ద బోత్త కొట్టింది. ఈ హీరోకు గత కొంతకాలంగా విజయం దోబుచులాడతోంది. ప్రస్తుతం నితిన్ .. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ .. పవన్ .. నితిన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తోంది. ప్రేమకథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమా పూర్తికాక ముందే దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ మరో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి ‘శ్రీనివాస కల్యాణం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మార్చి 3వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.
అదే నెల 23వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా కోసం కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేతలను ఎంపిక చేసుకున్నారు. మరి నితిన్ ఈ సినిమాలతోనైనా హిట్టు కొడతాడో చూడాలి.