నితిన్ కు జోడిగా రకుల్..

596
Nithin Rakul
- Advertisement -

యంగ్ హీరో నితిన్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా భీష్మ. ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల ఈచిత్రినికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మీక మందన కథానాయికగా నటిస్తుంది. ఇటివలే ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. మ‌హ‌తి సాగ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈసినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. భీష్మ షూటింగ్ పూర్తైన తర్వాత ఈసినిమాను ప్రారంభించనున్నారు. అయితే చంద్రశేఖర్ ఏలేటి మూవీలో నితిన్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారని సమాచారం. ఆమె క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుందని చెబుతున్నారు.

ఈసనిమాతో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. ఛల్ మోహన రంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ణ చైతన్య తో మరో సినిమా చేయనున్నాడు నితిన్. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌పై నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌కి ప‌వర్ పేట అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు టాక్.

- Advertisement -