నిర్బయ దోషులకు..రేపే ఉరి

350
nirbaya
- Advertisement -

నిర్బయ దోషుల ఉరి ఖరారైంద. షెడ్యూల్ ప్రకారం రేపు దోషులను ఉరి తీయనున్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా డెత్ వారెంట్లపై స్టే ఇచ్చేందుకు న్యాయస్ధానం కూడా తిరస్కరించింది. దీంతో రేపే నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.

మంగ‌ళ‌వారం(రేపు) ఉద‌యం 6 గంట‌ల‌కు ఉరి తీయనున్నారు అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి కూడా చేశారు. ఉరిని నిలిపివేయాల‌ని అక్ష‌య్‌కుమార్‌(31), ప‌వ‌న్ గుప్తా(25), ముకేశ్ సింగ్(32) పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ల‌ను ఇవాళ పాటియాలా కోర్టు తిర‌స్క‌రించింది. నిందితుడు ప‌వ‌న్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్ పిటిష‌న్‌ను ఇవాళ‌ సుప్రీం కొట్టివేసింది. దోషులంతా కోర్టు స‌మాయాన్ని వృధా చేశార‌ని, వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే య‌త్నం చేశార‌ని, రేపు వారిని క‌చ్చితంగా ఉరి తీస్తార‌ని నిర్భ‌య త‌ల్లి అన్నారు.

- Advertisement -