సమగ్ర వ్యవసాయంపై సర్కారు దృష్టి

268
niranjan reddy
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానంపై దృష్టి సారించింది. ఈ మేరకు వ్యవసాయ, విత్తన, ఉద్యాన, మార్కెటింగ్, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు నిరంజన్ రెడ్డి. దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయి .. దానిని బలోపేతం చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం ఏ రాష్ట్రంలోనూ లేదని… ప్రభుత్వ సూచనల ప్రకారం పంటలు సాగుచేసేలా చూడాలన్నారు. రైతులను ఆ దిశగా సన్నద్ధం చేయాలని….- ఒకే రకం పంటల సాగుతో రైతులు నష్టపోతారని చెప్పారు.

తెలంగాణలో ప్రజల ఆహార వినియోగంపై ప్రభుత్వం సంపూర్ణ సర్వే నిర్వహించిందని… తెలంగాణలో వినియోగంతో పాటు దేశంలో, ప్రపంచంలో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రపంచ ఆహార అవసరాల వివరాలను అధికారులు సేకరించాలని… సాంప్రదాయ సాగు నుండి రైతులను బయటకు తీసుకువద్దాం అన్నారు.

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు పంటను అమ్ముకునేందుకు కష్టపడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని… తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థితికి చేరాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

- Advertisement -