ఎప్పుడూ… నిన్నే చూస్తు

212
Ninne Chusthu updates
- Advertisement -

శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్‌ పతాకంపై వీఎస్‌ ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసిని, భానుచందర్, సుమన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని ఇప్పుడు శరవేగంగా రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం

ఈ సందర్భంగా నిర్మాత హేమ‌ల‌తా రెడ్డి మాట్లాడుతూ “మా వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘నిన్నే చూస్తు’ రెండో చిత్రం. ఓ మంచి కుటుంబ కథా చిత్రంగా ‘నిన్నే చూస్తు’ చిత్రాన్ని రూపొందిస్తున్నాము అని తెలిపారు. సీనియర్ నటులు సుహాసిని, సుమన్, భాను చందర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మా చిత్రంలో సుహాసిని గారు నటించటం మా అదృష్టం. వారు నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సుమన్ మా కుటుంబంలో ఒక భాగంగా కలిసిపోయారు. మొదటి షెడ్యూల్ అవుట్ ఫుట్ చూశాక చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేస్తాము అని తెలిపారు.

భాను చందర్, సుమన్ , కినెర , కాశీ విశ్వనాధ్ , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్, జోతిరెడీ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వి.ఎస్. ఫనీంద్ర, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర, ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్

- Advertisement -