జనసేనకు జై కొట్టిన అర్జున్ సురవరం

433
nikhil
- Advertisement -

జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి,సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు హీరో నిఖిల్. ప్రజలకు సమర్పించిన వాగ్దానాలతో బాండ్ పేపర్‌ను లక్ష్మీనారాయణ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బాండ్‌ పేపర్‌తో లక్ష్మీనారాయణను కలిసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన నిఖిల్ ప్రతి ఆర్టిస్ట్ తన ఫ్యామిలీ అని పవన్ చెప్పారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్‌కి సపోర్ట్ చేస్తూ, జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణని కలిసి పోల్ ప్రామిస్ అఫిడవిట్ గురించి మాట్లాడాను అని తెలిపారు

రాజకీయనాయకుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం ఇదే తొలిసారి పేర్కొన్న నిఖిల్…జేడీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు జనసైనికులతో పాటు విశాఖపట్నంలోని భీమిలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచర్ల సందీప్‌ను కూడా కలిసినట్లు నిఖిల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డబ్బులులేని సామాన్యులు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అవ్వొచ్చని ఇప్పటికీ నమ్మకం కలుగుతోంది. థ్యాంక్స్ పవర్ స్టార్ అంటూ నిఖిల్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే జనసేనకు మద్దతుగా మెగా హీరోలతో పాటు జబర్దస్త్ నటులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చివరిరోజునా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా జనసేనకు మద్దతిస్తోన్న సినీ నటుల జాబితాలో హీరో నిఖిల్ కూడా చేరడంతో పవన్ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -