త్వరలో తెరపైకి ‘కార్తికేయ 2’..

208
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

Nikhil Siddharth

ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు నిఖిల్, చందూ కూడా సీక్వెల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు గానీ కుదరలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలో పట్టాలెక్కబోతుంది.

Nikhil Siddharth

ఈ సినిమాను నిర్మించడానికి ఓ నిర్మాణ సంస్థ ముందురావడంతో ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుందని తాజా సమాచారం. ఏసియన్ సునీల్ నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. ‘కార్తికేయ 2’ ను నిర్మించడానికి ఆయన ముందుకు రావడంతో, చందూ మొండేటి .. నిఖిల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తిచేసి, ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత శేఖర్ కమ్ముల .. నాని కాంబినేషన్లో ఏసియన్ సునీల్ మరో సినిమా చేయనున్నాడని సినీ వర్గాల సమాచారం.

- Advertisement -