నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి..!

232
- Advertisement -

‘కిర్రాక్ పార్టీ’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత, నిఖిల్ హీరోగా టీ.యన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముప్పై శాతం పూర్తి చేసుకుంది.

‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్యా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ ల పై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్నారు.

Nikhil pairs up with Lavanya Tripathi

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు సాంకేతిక నిపుణులు:పి.ఆర్.ఓ : వంశి – శేఖర్ ,కాస్ట్యూమ్ డిజైనర్ : రాగా రెడ్డి,ఫైట్స్: వెంకట్డి,ఆర్ట్ డైరెక్టర్ : సాయి సురేష్,సంగీతం: శ్యాం సి ఎస్, ఛాయాగ్రహకుడు: సూర్యా,నిర్మాత: కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్,సమర్పణ: ఠాగూర్ మధు ,బ్యానర్: ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి, కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: టీ.యన్.సంతోష్.

- Advertisement -