నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం…

74
KCR AT Nijamabad
- Advertisement -

ఆదునిక సదుపాయాలతో ఇటీవల నిర్మాణం పూర్తయిన నిజామాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 5/9/2022 సోమవారం మంగళ వాయిద్యాల చప్పుల్ల మధ్య ప్రారంభోత్సవం చేశారు. కలెక్టరేట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో సకల సదుపాయాలతో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ఈ సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించింది.

అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. తరువాత కలెక్టర్‌ సీ నారాయణరెడ్డిని కలెక్టర్ కుర్చీలో కూర్చుండబెట్టి, పుష్పగుచ్ఛం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో అధికారి స్మితా సబర్వాల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -