నాన్నకు ప్రేమతో…నరసాపురంలో నిహారిక

487
nagababu niharika
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు ఓటేయాలని ప్రజలను కోరారు మెగాడాటర్ నిహారిక. నరసాపురంలో తండ్రి నాగబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతం తమ సొంత ప్రాంతమని, ఇక్కడి ఓటర్లు తన తండ్రిని గెలిపిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు.

పవన్ కల్యాణ్, మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలనూ నెరవేరుస్తామని అన్నారు ఎంపీ అభ్యర్థి నాగబాబు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా, పేదలు ఇంకా పేదవారిగానే ఉన్నారని, ఆర్థిక అసమానతలు పోవాలంటే, జనసేన అధికారంలోకి రావాలని అన్నారు.రేషన్ బదులు రూ. 2,500 డబ్బులు ఇస్తామని, పేదలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని అన్నారు. ఏపీలో జనసేనకు అధికారం కట్టబెట్టాలని కోరారు.

ఇక ఇప్పటికే మెగా హీరోలు అల్లు అర్జున్,రామ్ చరణ్ తేజ్,సాయిధరమ్ జనసేనకు జై కొట్టగా వరుణ్ తేజ్ త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే నాగబాబు కోసం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు రంగంలోకి దిగారు. హైపర్ ఆది రెండు, మూడు రోజులుగా నర్సాపురం, భీమవరం నియోజవర్గాల్లో నాగబాబు సతీమణితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక భీమవరం,గాజువాకలో పవన్‌ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు గబ్బర్ సింగ్ గ్యాంగ్.

- Advertisement -