పబ్‌పై పోలీసుల రైడ్‌.. పట్టుబడిన మెగా డాటర్‌..

101
- Advertisement -

హైదరాబాద్‌ బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై గత అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పీఎస్‌కి తరలించారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కీల‌క వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పబ్‌లో పోలీసులు కొకైన్, గంజాయి, ఎల్‌ఎస్‌డీ గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో సినీ నటి నిహారిక కూడా ఉంది. ఆమెతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిన‌ట్లు తెలుస్తోంది.

ఈవ్యవహారంలో మరికొందరి ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు స‌మాచారం. పబ్‌లో ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారన్న విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. పబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు కొన‌సాగుతోంది. పోలీసులు వ‌చ్చార‌ని తెలుసుకున్న వెంట‌నే కొంద‌రు త‌మ వ‌ద్ద ఉన్న డ్ర‌గ్స్‌ను బ‌య‌ట ప‌డేసే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలిసింది. కాగా, పోలీసుల‌కు పట్టుబడిన యువకులు పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా చేయ‌డం గ‌మ‌నార్హం. తమను ఎందుకు తీసుకువచ్చారని ర‌చ్చ చేశారు.

- Advertisement -