ఏపీలో అమల్లోకి నైట్ కర్ఫ్యూ..

53
ap
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా చాపకింద నీరులా కోరలు చాస్తోంది. కరోనా కేసుల ధాటికి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకిరాగా పోలిసులు కర్ప్యూ అమలు చేశారు.

అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇవ్వగా నైట్ తిరిగే వారిని గుర్తించి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వచ్చిన వారికి రూ. 100 జరిమానా విధిస్తున్నారు. నైట్ కర్ఫ్యూతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి . కర్ప్యూ సమయంలో కారణం లేకుండా రోడ్లపై తిరిగేవారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -