Nidhi Agarwal:రాజశ్యామల యాగం

35
- Advertisement -

‘మున్నామైఖెల్‌’తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే కొంతకాలంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కెరీర్‌ని తిరిగిగాడిలో పెట్టుకునేందుకు రాజశ్యామల యాగం నిర్వహించింది. టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ యాగాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధింన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించింది నిధి. గతంలో రష్మిక మందన్న కూడా వేణుస్వామితో పూజలు చేయించినట్లు వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -