ప్రొఫెసర్‌గా మారనున్న ‘భీమ్లా నాయక్’..!

110
- Advertisement -

ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాతో హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా వదిలారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చనున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారనే ఒక టాక్ వినిపిస్తోంది.

ఇక పవన్‌ మరోవైపు క్రిష్‌తో ‘హరి హర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ షూటింగు కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. ‘భవదీయుడు భగత్ సింగ్’లో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. హరీశ్ శంకర్‌తో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది.

- Advertisement -