ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన నవ వధువు..

150
New Bride
- Advertisement -

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఓట‌ర్లు ఉత్సాహంగా ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉండగా.. తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువ‌తి కాసేప‌ట్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటు వేసింది. ఫిర్దోస్‌ బేగం అనే యువ‌తి కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓట‌ర్లకు స్ఫూర్తినిచ్చింది. ఓటు వేసిన అనంత‌రం అక్క‌డి నుంచి పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్‌‌ హాలుకు వెళ్లింది.

- Advertisement -