నువ్వు సిగ్గు పడాలి.. నటి పై సీరియస్

23
- Advertisement -

తెలుగు చిత్రాల్లో ఇటీవల ప్రతినాయిక పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. కోలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాంటి ప్రతిభ కలిగిన ఎంతో మంది నటీనటులకు తమిళ ఇండస్ట్రీలో ఆదరణ దక్కట్లేదని వరలక్ష్మీ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా పుట్టింది తమిళ తెర మీదే. తమిళ మేకర్స్ కూడా ఆమెను బాగానే ఆదరించారు. కానీ, వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రం తెలుగు సినిమాల పై మోజు పెంచుకున్నారని, అందుకే, ఆమె తమిళ ఇండస్ట్రీ పై విషం చిమ్ముతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్స్ ఇలా ఇలా కామెంట్స్ చేయడానికి ఒక కారణం ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ ఇండస్ట్రీ పై నెగిటివ్ కామెంట్స్ చేసి.. టాలీవుడ్‌ పై మాత్రం పొగడ్తల వర్షం కురిపించింది. ఇంతకీ వరలక్ష్మీ ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే.. ‘తెలుగులో నాకు చాలా మంచి ఆదరణ దక్కుతుంది. తెలుగు ప్రేక్షకులు నన్ను వారి ఇంటి బిడ్డగా ప్రేమిస్తున్నారు. అలాగే, తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ ను డిజైన్ చేస్తున్నారు’ అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.
పైగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంకా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఇక హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యే ప్లాన్‌లో ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టింది. ఈ కామెంట్స్ పై కూడా తమిళ నెటిజన్స్ ఆమె పై విరుచుకుపడుతున్నారు. పక్క భాషలో నాలుగు అవకాశాలు రాగానే పుట్టిన ఊరిని కూడా మర్చిపోవడానికి, అలాగే వదిలిపోవడానికి సిద్ధ పడినందుకు నువ్వు సిగ్గు పడాలి’ అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ పై వారు విరుచుకుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -