నేపాల్ను ముంచెత్తిన వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడిన దారుణ పరిస్థితుల నేపథ్యంలో సమయానికి సహాయం అందించినందుకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కష్టసమయంలో నేపాల్కు అండగా నిలిచి, టన్నుల కొద్దీ సామగ్రితో పాటు శోధన, సహాయక చర్యల కోసం సాయం అందించిన మొదటి దేశాల్లో భారతదేశం ముందుందని అధ్యక్షుడు పౌడెల్ కొనియాడారు.
భారత్-నేపాల్ మధ్య ఉన్న పురాతన, దృఢమైన స్నేహసంబంధాలకు ఈ సమయానుకూల సాయం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆపద సమయంలో భారత్ స్పందించిన తీరు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచిందన్నారు.
Also Read:ఇమ్రాన్కు మద్దతుగా కమిన్స్
నేపాల్లో భారత రాయబారితో జరిగిన భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి మరియు భారత ప్రజలకు నేపాల్ ప్రభుత్వం, అక్కడి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

