- Advertisement -
నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేపాల్ ప్రధాని కేపీ ఓలికి పంపారు రమేష్ లేఖక్. రాజధాని ఖాట్మాండ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్ వంటి ప్రధాన యాప్స్ నేపాల్ లో బ్యాన్ చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు ప్రజలు.
ఈ ఘర్షణల్లో 19 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు హోంమంత్రి రమేష్ లేఖక్.
Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
- Advertisement -

