నేపాల్ కెప్టెన్…అరుదైన రికార్డు

469
nepal
- Advertisement -

పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో నేపాల్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. టీ20 క్రికెట్ ఫార్మట్‌లో నేపాల్ తరపున సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ఆ టీమ్ కెప్టెన్ పరాస్‌ ఖడ్కా రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు కోహ్లీకి కూడా ఈ ఫీట చేయడం సాధ్యం కాలేదు. ఖడ్కా రాణించడంతో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో మ్యాచ్‌లో నేపాల్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సింగపూర్‌ 3 వికెట్లు కొల్పోయి 151 పరుగులు చేసింది. సింగపూర్ జట్టులో డేవిడ్ 64,చంద్రమోహన్ 35 పరుగులతో రాణించాడు. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 16 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

నేపాల్ కెప్టెన్‎గా ఖడ్కా సెంచరీ చేసి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, 9 సిక్సర్లుతో 106 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేపాల్ జట్టు తన తర్వాత మ్యాచ్‌ అక్టోబర్ 1న జింబాబ్వేతో తలపడనుంది.

- Advertisement -