Nepal Bus Accident: నదిలో పడిన బస్సు.. 14 మంది మృతి

3
- Advertisement -

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రమాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడగా 14 మంది మృతి చెందారు. బస్సులో ఉన్న వారంతా భారతీయులే కాగా ప్రయాణికులు కొందరు నదిలో పడి కొట్టుకుపోగా.. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ పర్యాటక బస్సు నేపాల్‌లో పర్యటించేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే 40 మందితో వెళ్తున్న ఆ బస్సు.. తనహున్ జిల్లాలోని మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పోఖారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read:Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా

- Advertisement -