నవాబ్‌పై డయానా భారీ ఆశలు ..!!

218
Maniratnam nawab
- Advertisement -

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అగ్రదర్శకుడు మణిరత్నం మరోసారి నవాబు రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందించగా తమిళంలో చెక్క చివంతా వానం అనే పేరుతో విడుదల అవుతున్నది ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్ ,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుంది.

ఎమోషనల్, యాక్షన్ అంశాలను మేలవించి ఈ చిత్రాన్ని మణిరత్నం రూపొందించారు. కాగా ఈ సినిమా లో హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది.. ఈ సినిమా తో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.. ఇప్పటికే లుక్ లో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటన
లోనూ పర్వాలేదు అనిపించుకుంటే టాలీవుడ్ ను ఎలేస్తుంది మరీ.

- Advertisement -