నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది పాటు జైలు..

93
Navjot Sidhu
- Advertisement -

భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 30 ఏళ్ల క్రితం నాటి కేసులో సిద్ధూకు అత్యున్నత న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ పాటియాలాలోని సెషన్స్ కోర్టు 1999 సెప్టెంబర్ 22న సిద్ధూని, అతని అనుచరుడుడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూని దోషిగా ప్రకటిస్తూ, ఆయనకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ 2006లో తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసుకునే వెసులుబాటును సిద్ధూకు కల్పించింది.

- Advertisement -