మార్కజ్ ప్రాంతాన్ని సంద‌ర్శించిన అజిత్ ధోవాల్

356
- Advertisement -

నిజాముద్దీన్ మార్కజ్ ప్రాంతంలో మతప‌ర‌మైన ప్రార్ధ‌న‌లు జరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రార్ధ‌న‌ల్లో పాల్గోన్న విదేశీయుల‌కు క‌రోనా సోకింది. ఈ ప్రార్ద‌న‌ల్లో చాలా మంది ఇండియాకు సంబంధించిన ముస్లింలు పాల్గోనారు. వారికి కూడా క‌రోనా సోకిన‌ట్లు గుర్తించారు అధికారులు. తాజాగా మార్కజ్ ప్రాంతాన్ని సంద‌ర్శించారు జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారు అజిత్ ధోవాల్.

రాత్రి 2 గంటల సమయంలో మార్కజ్ ప్రాంతాన్ని సందర్శించినట్లు సమాచారం. నిన్న జ‌రిగిన అంతర్గత భద్రత సమావేశం తర్వాత సందర్శించినట్లు తెలుస్తుంది. కాగా నిజాముద్దీన్ మార్కజ్ ప్రాంతాన్ని శానిటైజేషన్ చేశారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు.నిజాముద్దీన్ దర్గా షరీఫ్ సహా చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌ను శానిటైజేష‌న్ చేశారు. శానిటైజేషన్ అనంతరం ప్రాంతాన్ని సందర్శించా రు ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు.

- Advertisement -