నవంబర్ 29న “రఘుపతి వెంకయ్య నాయుడు” చిత్రం

327
raghu
- Advertisement -

నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

ఈ సినిమా గురించి నరేష్ మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకు ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్య చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ఈ సినిమా కోసం చాలా రీసర్చ్ చేసాం.. నటీనటులు కూడా తమ ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు రాఘుపతి వెంకయ్య నాయుడు సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -