సీఎం రేవంత్‌తో నరసింహన్ భేటీ

31
- Advertisement -

హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ గవర్నర్ నరసింహన్. సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అంతకముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదా ఆశీర్వచనం అందజేయగా ఈవో రామకృష్ణారావు లడ్డూ ప్రసాదం, స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేశారు నరసింహన్. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వచ్చారు.

Also Read:మహేష్ బాబు పై కాంగ్రెస్ కోపం

- Advertisement -