టాలీవుడ్ నటుడు నానీ రూటే సపరేట్. విభిన్నమైన కథాంశంతో కూడిన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహాయదర్శకుడిగా వచ్చిన నానీ ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని న్యాచురల్ స్టార్గా ఎదిగాడు.
ప్రస్తుతం నానీ వరుస సినిమాలతో దూసుకుపోతూ సూపర్ హిట్ చిత్రాలు చేస్తున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఇక విషయమేమిటంటే ‘వెప్పం’ అనే సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరోసారి తమిళ చిత్రంలో కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో ‘వేలన్ ఎట్టుత్తిక్కుమ్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా అమలాపాల్ నటిస్తుండగా శరత్ కుమార్, నాజర్, చిత్రలక్ష్మణన్, శివబాలాజి, పార్వతీమీనన్, నాగిని త్రివేది తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
అన్యాయాలు, అక్రమాలపై పోరాడే ఓ యువకుడి ఇందులో నానీ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో విడుదల సన్నాహాలు చేస్తున్నారు చిత్రనిర్మాతలు. నాని ప్రస్తుతం ఇవి గాక నాగ్తో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ చేస్తున్నాడు.