- Advertisement -
నితేశ్ తివారి దర్శకత్వంలో రణ్బీర్ కపూర్,సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’ . రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుంది. కన్నడ స్టార్ నటుడు యష్ రావణుడి పాత్రలో నటించబోతున్నాడు.
రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ముల్లోకాలను త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణువు, శివుడు) పరిపాలిస్తున్నారు. బ్రహ్మ అందరిని సృష్టిస్తే.. విష్ణువు రక్షిస్తాడు. శివుడు అంతం చేయగలిగే వాడు. అయితే, వారు సృష్టించిన ఈ మూడు లోకాలపై ఆధిపత్యం కోసం వారు ఎదురు తిరిగినప్పుడు, అన్ని యుద్ధాలను అంతం చేసే ఒక మహాయుద్ధం మొదలైంది అంటూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంది.
- Advertisement -

