కేటీఆర్‌కు నామా విషెస్‌…

439
ktr nama
- Advertisement -

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు. సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీని శక్తివంతమైన జాతీయ పార్టీగా కేటీఆర్ రూపుదిద్దుతున్నారని కొనియాడారు. ఆయన ఇలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకోని టీఆర్ ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని అకాంక్షించారు.

తెలంగాణ భవన్ లో టిఆఎస్ఎస్వీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్,దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో

పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి,గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -