మొబైల్ రైతు బజార్‌ను ప్రారంభించిన నల్గొండ ఎమ్మెల్యే..

266
MLA Bhupal Reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ సూచించిన విధంగా కరోనా వైరస్ సోకకుండా రోగనిరోధక శక్తిని పెంచే బత్తాయి, నిమ్మ, పండ్లను ప్రతి ఒక్కరు తినాలని సూచించారు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. బత్తాయి, నిమ్మ ,పుచ్చకాయ పండ్లు అమ్మే మొబైల్ రైతు బజార్ ఆటోలను నల్గొండలో కలెక్టర్‌తో కలిసి భూపాల్ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే బత్తాయి, నిమ్మ పండ్లను రైతులు పండిస్తారని, ఇక్కడి దిగుబడులు గ్రామాల్లోని ప్రజలకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచే విధంగా మొబైల్ మార్కెట్‌ల ద్వారా అందిస్తున్నామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ బత్తాయి నిమ్మ రైతులను ఆదుకునే విధంగా కార్యాచరణ రూపొందించారని, రైతులు ఎవ్వరు నష్టపోకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు.

- Advertisement -