బండికి షాక్…రైతుల నిరసన సెగ

93
Bandi sanjay
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి షాక్ తగిలింది. నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన బండిని అడ్డుకున్నారు రైతులు. నల్లగొండ టౌన్‌లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ధాన్యం కొనుగోలుపై ఆయనతో వాగ్వాదానికి దిగారు. యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు.ధాన్యం సేకరణపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ రైతులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -