కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..

282
Nakrekal MLA Chirumarthi
- Advertisement -

కాంగ్రెస్‌కు మరో షాకిచ్చి కారెక్కనున్న మరో ఎమ్మెల్యే… ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుండ గెలిచిన పలువురు నేతలు ఇతర పార్టీలోకి జంప్ చేసున్నారు.

ఈ నేపథ్యంలో ఇదివరకే ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎమ్మెల్యే రేగ కాంతారావులు పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరడానికి సిద్ధమౌతున్నారు. వీరితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Nakrekal MLA Chirumarthi

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఈ రోజు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కాగా, లింగయ్య త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈయన టీఆర్ఎస్‌లో చేరితే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలినట్లేనని పలువరు భావిస్తున్నారు. మరి టీఆర్ఎస్‌లో చేరకుండా చిరుమర్తిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా ఆపుతారో చూడాలి. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్‌కు గూడికి చేరడం కాంగ్రెస్‌కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -