మనస్సు మార్చుకుని కలుస్తారేమో..

225
Nagarjuna's son Akhil Akkineni, Shriya Bhupal call off May wedding
- Advertisement -

ఇటీవలె అఖిల్ నిశ్చితార్థం శ్రియాభూపాల్‌తో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని కొద్దిమంది ప్రముఖులతో పాటు పరిమిత సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, టాలీవుడ్‌లో వీరి పెళ్లి ఆగిపోయిందంటూ పెద్ద రూమర్ నడుస్తోంది.

ఏదో ఒక సినిమా గురించి దిల్ రాజు చేస్తున్నాడని న్యూస్ వస్తేనే.. అబ్బే నేను ఎటువంటి సినిమానూ చేయట్లేదు అంటూ ట్వీటేసిన కింగ్ నాగార్జున.. ఇప్పుడు మాత్రం కనీసం అఖిల్ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందా అనే విషయం గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా ట్వీటకపోవడం నిజంగానే చాలా షాకింగ్ అంశం. అయితే నాగ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది.

Nagarjuna's son Akhil Akkineni, Shriya Bhupal call off May wedding

జివికె వారి మనువరాలు శ్రీయ భూపాల్ తో ఎంతో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలను చూస్తుంటే.. అరే ఈ కపుల్ ఎలా విడిపోయారబ్బా అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. నాగార్జునకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉందట. అందుకే ఆయన త్వరలోనే ఏమైనా శ్రీయ అండ్ అఖిల్ లు మనస్సు మార్చుకుని కలుస్తారేమో అని చూస్తున్నారట. కేవలం ఈ పెళ్ళి డేట్ మాత్రమే క్యాన్సిల్ అయ్యింది కాని.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోలేదు వీరు అని టాక్ వినిపిస్తోంది.నిజానికి ఇప్పటివరకు పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది అనే విషయంపై ఇంతవరకు అఖిల్ కాని.. నాగ్ కాని.. చైతూ కాని.. సమంత కాని.. ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఇప్పుడు వీరిద్దరి పెళ్లి క్యాన్సిల్ అవుతుందన్న వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రియాభూపాల్‌, అఖిల్‌ పెళ్లి బ్రేక్‌ అయ్యింద లేదా అనే విషయంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

సర్లేండి.. ఉత్తిపుణ్యానికి బ్రేకప్పులు పెడబొబ్బులూ ఏమిటసలు.. ఇద్దరూ కలిస్తే నాగ్ ఒక్కడే కాదు.. ఆయన అభిమాన గణం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు.

- Advertisement -