రాజుగారి గదిలోకి నాగ్..!

216
- Advertisement -

గత ఏడాది రిలీజ్ అయి బాక్స్ ఆఫిస్ దగ్గర సంచలనం సృష్టించిన చిత్రాలలో రాజుగారి గది ఒకటి. ఓంకార్ డైరెక్షన్లో తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన రాజుగారి గది సూపర్ హిట్ అయింది. పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమాకు సిక్వెల్‌ తెరకెక్కిస్తానని దర్శకుడు ఓంకార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా సిక్వెల్‌లో వెంకటేష్ నటిస్తున్నాడన్న వార్తలు వెలువడ్డాయి. వెంకటేష్ కూడా ‘రాజుగారి గది’ సీక్వెల్‌లో నటించడానికి ఆసక్తి చూపించాడట. కానీ ఇతర ప్రాజెక్టులతో అతను బిజీగా ఉండటంతో నాగార్జున పేరు తెరమీదకు వచ్చింది.వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాగార్జున ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత నాగ్ బంగార్రాజు తర్వాత ‘రాజుగారి గది 2’ చిత్రంలో నటించనున్నారని సమాచారం.

దర్శకుడు ఓంకార్ చెప్పిన స్క్రిప్ట్ విని నచ్చడంతో ఈ సినిమాకు ఓకే అన్నాడట. పివిపి సినిమా బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. వచ్చే నెల ఈ చిత్రం ప్రారంభంకానుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో ‘రాజుగారి గది’లో నటిం చిన అశ్విన్ మెయిన్ రోల్ లో నటిస్తాడు. ఇక లీడ్ రోల్‌లో నటించే నాగా ర్జున తొలిసారి హార్రర్ కామెడీ మూ వీలో నటించబోతుండడం విశేషం.

అన్నపూర్ణ కాంపౌండ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాకి టైటిల్ రాజుగారి గది పార్ట్ 2నే. అయితే కధ మాత్రం ఓంకార్ ది కాదు. ఇటివల మలయాళంలో వచ్చిన ఓ హారర్ సినిమా హక్కులను కొనుగోలు చేశారట నాగార్జున. ఇప్పుడా రిమేక్ ను ఓంకార్ తో తెరకెక్కిస్తారట. దీనికి అల్రెడీ పాపులర్ అయిన రాజుగారి టైటిల్ ని తగిలిస్తారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.

- Advertisement -