బిగ్ బాస్ విజేతపై క్లారిటీ ఇచ్చిన నాగ్‌..!

437
nag
- Advertisement -

బిగ్‌బాస్ 3 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ విజేత అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీలు టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ శ్రీముఖి-రాహుల్‌ల మధ్యనే ఉంది.

ఇక ఫైనల్ ఎపిసోడ్ దుమ్ములేపేందుకు మమ్ముర ఏర్పాట్లను చేశారు స్టార్ మా. ఇప్పటికే ఫైనల్ ఎపిసోడ్ షూట్ పూర్తికాగా.. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? గెస్ట్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 3 విజేతను ఎవరు ప్రకటించబోతున్నారు? అనేవి సీక్రెట్‌గానే ఉంచారు.

Bigg-Boss-3

ఈ నేపథ్యంలో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేసింది.’ఈ సీజన్ విజేత శ్రీముఖి’ అనే వార్తతో పాటు ఇందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు రాహుల్ గెలిచాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ వ్యాఖ్యాత నాగార్జున స్పందించారు.

‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ షో విజేతపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మొద్దు. విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమం చూసి తెలుసుకోండి’ అని ట్విటర్‌ ద్వారా నాగార్జున క్లారిటీ ఇచ్చారు. మరి కొన్ని గంటల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది.

- Advertisement -