నాగ్ దగ్గరకు బాలయ్య కథ

2136
- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుల కొరత బాగా ఉంది. ఇవ్వాళ రేపు సరైన మ్యాటర్ ఉన్న దర్శకులు దొరకడం లేదు. దీనికితోడు.. విషయం ఉన్న దర్శకులకు ఫామ్ లో ఉన్న హీరోలను సెట్ చేయడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రశాంత్ వర్మలో మ్యాటర్ ఉందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. అందుకే, ప్రశాంత్ వర్మ ని బాలయ్యను ఓ దగ్గరకు చేర్చారు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, యువ వంశీ కలిపింది.

కానీ కథ విషయంలో బాలయ్య ఓకే అనలేకపోయాడు అని టాక్ నడుస్తోంది. దాంతో ఆఖరికి అదే కథ పట్టుకుని ప్రశాంత్ వర్మ నేరుగా నాగార్జున దగ్గరకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్వీ ప్రసాద్ తో సంబంధం లేకుండా యువినే ఈ సినిమాను నిర్మిస్తారట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేస్తున్న హనుమాన్ సినిమా తరువాత నాగార్జున తో ఈ సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

అయితే, బాలయ్యకు నచ్చని కథ.. నాగార్జునకు ఎలా నచ్చింది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ బాలయ్య బాబుకు ప్రశాంత్ వర్మ ఏ తరహా కథ చెప్పారు, మరి ఆ కథలో బాలయ్య అభ్యంతరాలు ఏమిటి? ఎందుకు వాటికి తగిన మార్పులను ప్రశాంత్ వర్మ చేయలేకపోయారు. మరి అదే కథ నాగార్జున కు ఎలా నచ్చింది అన్న అప్ డేట్ లు త్వరలో బయటకు వచ్చే అవకాశాలు వున్నాయి.

ఇవి కూడా చదవండి…

హను-మాన్ అండర్ వాటర్ చిత్రీకరణ…

దసరా క్లైమాక్స్ షూటింగ్…

పాన్ ఇండియా కాదు..అంతకు మించి

- Advertisement -