హస్తినలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ

39
- Advertisement -

కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది.టికెట్ దక్కని నేతలంతా పార్టీని వీడుతుండగా తాజాగా ఇల్లందు నియోజకవర్గ కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పారాషూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీని కాపాడండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.డబ్బు ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారని పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్యారాచ్యుట్లకు టికెట్ల కేటాయించడం సిగ్గు చేటని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనలాంటి వారిని విస్మరించడం సరికాదని మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి అన్నారు. తుర్కయాంజల్ అరుణ కన్వెన్షన్ హాల్లో తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ తనకు కాకుండా వేరే వ్యక్తులకు ప్రకటించడంతో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు.

Also Read:నర్సాపూర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి

- Advertisement -