గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం: నాగచైతన్య

272
naga chaitanya
- Advertisement -

రాజ్యసభ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది , చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ,కార్యకర్త నుండి ప్రధాన కార్యదర్శుల వరకు , కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు , కోటా నుండి కోలకతా వరకు , సెర్చ్ ఇంజిన్ లో టాప్ , ట్రెండింగ్ లో హిస్టరీ , ఆల్ ఇండియా లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , ఇలా ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఆదరిస్తున్నారు.

ఆశీర్వదిస్తున్నారు .. ఇందులో భాగంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారు గచ్చ్చిబౌలి లోని తన నివాసం లో మొక్కలు నాటారు.ఈ సందర్బంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారు మాట్లాడుతూ మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం , మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు , ఆలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి ,మన అవగాహనా లోపం తో మనం మొక్కలు నాటడం అశ్రద్ధ చేస్తున్నాం కానీ అల చేయకుండా ఈ ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో పాల్గొనాలి అని , ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా … ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి నా వంతుగా మరో ముగ్గురు యాక్టర్ సుశాంత్ , స్క్రీన్ రైటర్ & డైరెక్టర్ శివ నిర్వణ , నటి రఖుల్ ప్రీతీ , డైరెక్టరు విక్రమ్ కె కుమార్ గార్లని గ్రీన్ ఛాలెంజ్ కి నామినేషన్ చేశారు.

- Advertisement -