అఖిల్ మూవీ ప్రీ రిలీజ్..అతిథిగా చైతూ

131
chaitu
- Advertisement -

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. అక్టోబర్ 15న సినిమా విడుదలకానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటలకు, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు నాగ చైతన్యను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు.

మోఅఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని లాంటి నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -