Kalki:కాశీలోనే మొదలై..కాశీలోనే ముగుస్తుంది!

5
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా జూన్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరుగగా స్టోరీని రివీల్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ కల్కి స్టోరీ అని చెప్పారు అశ్విన్. గంగానది ఒడ్డున ఉన్న పవిత్ర కాశీ నగరం ప్రపంచంలోనే మొదటినగరం….ఇదే చివరి నగరం కూడా అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ ఉంటుందన్నారు.

భూమి మీద అన్ని వనరులు అంతరించిపోతాయి. కానీ కాశీలో కాంప్లెక్స్ మనుషులు అని కొంతమంది ప్రత్యేకంగా నిర్మించుకొని ఉంటారు. అక్కడ అన్ని దొరుకుతాయి. సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లాలని భావిస్తూ ఉంటారు. కానీ కాంప్లెక్స్ మనుషులు వేరే మనుషులని రానివ్వరు..ఇలా ఈ మూడు ప్రపంచాలను కలుపుతూ సాగే కథ ఇదని చెప్పారు నాగ్ అశ్విన్.

Also Read:సన్నీ డియోల్‌తో గోపిచంద్!

- Advertisement -