జనసేనలోకి నాదేండ్ల..

225
Nadendla Joins Janasena
- Advertisement -

ఏపీ మాజీ స్పీకర్,కాంగ్రెస్ నేత నాదేండ్ల మనోహర్ జనసేనలో చేరికకు రంగం సిద్ధమైంది. పవన్ తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు.తాను జనసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు మనోహర్. జనసేనలో చేరిన అనంతరం పవన్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఇప్పటికే స్టార్ లీడర్‌ లేక కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు నాదేండ్ల పార్టీ నుంచి తప్పుకోవడం పెద్దషాకే. మనోహర్ చేరికతో జనసేనకు మరింత ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడిగా కాంగ్రెస్‌ పార్టీలో అడుగుపెట్టిన నాదెండ్ల మనోహర్… రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా ఎవరు ఉహించని విధంగా జనసేన చేరనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌,డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు మనోహర్. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ,ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు.

- Advertisement -