‘నాకు నేనే తోపు తురుమ్’ అంటు వస్తున్నాడు..

220
- Advertisement -

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటిస్తున్న చిత్రం ‘నాకు నేనే తోపు తురు ‘. దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేటి రాజకీయాల నేపథ్యంతో…పూర్తి వినోదాత్మక ప్రేమ కథగా ఈ సినిమా రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాలు కథలో ఇమిడి ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాకు నేనే తోపు తురుము విడుదలకు సిద్దమయ్యింది.వివరాలు నిర్మాత ధృవ కుమార్ తెలుపుతూ….

Naaku Nenu Thopu Thurum Releasing on July 28th

”మనం పూజించే దేవుళ్లు ఎందరున్నా అన్నం పెట్టే రైతు, దేశాన్ని రక్షించే సైనికులే కనిపించే దేవుళ్లు అనేది కథలో ప్రధానాంశం. ప్రజలు మారితేనే రాజకీయ పరిస్థితులు మారతాయి అనే సందేశాన్ని చిత్రంలో చెబుతున్నాం. పేదరికంలో పుట్టిన ఓ యువకుడు చిరు వ్యాపారిగా జీవితాన్ని మొదలుపెడతాడు. అతను రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ముఖ్యమంత్రిగా ఎదిగి తర్వాత ప్రధాని స్థాయికి చేరుతాడు. ప్రధాని హోదాలో అతను తీసుకున్న సంచలన నిర్ణయాలు సమాజంలో, ప్రజా జీవితంలో అత్యున్నత మార్పులు తీసుకొస్తాయి. ఈ యువ ప్రధాని తీసుకున్న వినూత్న చర్యలు ఏంటన్నది సినిమాలో చూడాలి. రాజకీయ అంశాలను, కథలోని సందేశాన్ని ఎక్కడా విసుగు లేకుండా వినోదాత్మకంగా చూపిస్తున్నాం. గోవా, హైదరాబాద్, విశాఖపట్నం లోని వివిధ అందమైన లొకేషన్లలో చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 28న నాకు నేనే తోపు తురుము చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.” అన్నారు.

Naaku Nenu Thopu Thurum Releasing on July 28th

సుమన్ శెట్టి, చలపతిరావు, సూర్య , జబర్దస్త్ అప్పారావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రేమ్ ఎల్ఎం, ఎడిటర్ నందమూరి హరి, సినిమాటోగ్రఫీ విజయ్ దగ్గుబాటి, నిర్మాత ధృవ కుమార్, దర్శకత్వం జి.శివమణి .

- Advertisement -