షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నా పేరు సూర్య’…

264
‘Naa Peru Surya Naa Illu India’ shoot wraps up
- Advertisement -

అల్లుఅర్జున్ హీరోగా అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ సినిమాతో వక్కంతపు వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పాటల వేడుకకు రెడీ అయింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సందర్భంగా హీరో, హీరోయిన్లు సెల్ఫీకి పోజులిచ్చారు.

 ‘Naa Peru Surya Naa Illu India’ shoot wraps up

ఆర్మీ నేపధ్యంలో రూపొందడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 22న పాటల వేడుక, 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్. కాగ మే 4 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -