మళ్ళీ మెగాహీరోతో మైత్రి మూవీస్‌..!

312
sai dharamtej
- Advertisement -

తెలుగు సినీ చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్,విజయ సంస్థ వంటి ఎన్నో నిర్మాణ సంస్థలు అగ్ర సంస్థలుగా పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. అలాంటిది కేవలం తీసింది మూడు సినిమాలే ఆ మూడు బ్లాక్ బస్టర్ కావడంతో అగ్ర నిర్మాణసంస్థల సరసన స్తానం సంపాదించుకుంది మైత్రీ మూవీస్. తెలుగులో ఓ బ్రాండ్ పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీస్‌ ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లతో చిక్కుల్లో పడింది.

ఇక మైత్రీ మూవీస్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుంది అన్న వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆ వార్తలకు చెక్‌పెట్టేలా వరుస సినిమాలకు కమిట్‌ అయ్యారు మైత్రీ మూవీస్ మేకర్స్‌. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో ‘చిత్రాలహరి’ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీస్‌ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తు సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతుండగా స్క్రిప్ట్ ఫైనలైతే త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Image result for మైత్రి మూవీస్‌శ్రీమంతుడు,జ‌నతా గ్యారేజ్,రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీస్. అయితే సవ్యసాచి,అమర్ అక్బర్ ఆంటోనితో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్న మైత్రీ మూవీస్‌ మెగాహీరోలపైనే భారాన్ని వేసి ముందుకుసాగుతోంది. తిరిగి మైత్రీ మూవీస్ సక్సెస్ ఫుల్‌ బ్యానర్‌గా పేరు సంపాదించుకుంటుందో లేదో వేచిచూడాలి.

- Advertisement -