బీజేపీలోకి మైహోం రామేశ్వరరావు!

145
- Advertisement -

ప్రముఖ పారిశ్రామిక వేత్త,మై హోం గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. బీజేపీ నుండి రాజ్యసభకు రామేశ్వరావును పంపిస్తారని ఇందుకు ఆయన కూడా ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలతో రామేశ్వరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి నిర్మించిన సమతామూర్తి విగ్రహా ప్రతిష్టాపనలో కీలకమైన వ్యక్తి రామేశ్వరావు. ఈ విగ్రహా స్ధాపన కోసం వంద ఎకరాలు విరాళంగా ఇచ్చారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే ఇప్పుడు రామేశ్వర్, జీయా స్వామి, కేసీఆర్ మధ్య కొన్ని విభేదాలు వచ్చినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.

- Advertisement -