మొక్కలు నాటిన సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్..

42
challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు కళ్యాణ్ మాలిక్.

ఈ సందర్భంగా కళ్యాణ్ మాలిక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడం గొప్ప నిర్ణయం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం సింగర్ చిన్మయి,లిరిక్ రైటర్ లక్ష్మీ భూపాల్,మ్యూజిక్ డైరెక్టర్ స్వర సాగర్ మహతి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని కళ్యాణ్ మాలిక్ కి బహుకరించారు.

- Advertisement -