మునుగోడు ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం:హరీశ్‌

45
- Advertisement -

తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలిస్తూ ప్రజల గోడు పట్టని బీజేపీ నాయకులరా ఏమొహం పెట్టుకుని ఓట్లు ఆడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఎన్నిక ద్వారా బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు 2016లో మర్రిగూడ పర్యటన సందర్భంగా నాటి ఆరోగ్య మంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.

మీ హామీలు ఏమయ్యాయి జేపీ నడ్డా గారు..?. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు. మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చౌటుప్పల్‌లో 8.2 ఎకరాల స్థలం కేటాయించింది. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్‌కు నయా పైసా ఇవ్వలేదు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడా హమీ ఇచ్చారు.

అబద్ధపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం. అని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

- Advertisement -