మునుగోడు బైపోల్..నేటి నుండి నామినేషన్లు

115
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుండి మొదలుకానుంది.చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.

ఉదయం 11 గంటలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జారీ చేయనున్నారు. ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు వ్యవహరిస్తారు. నోటిఫికేషన్ విడుదలకాగానే నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 10 నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14న చివరి రోజు నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరుదాదాపు ఖరారుకాగా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -